వర్క్‌ ఫ్రం హోం అంటూ.. 15 లక్షలు స్వాహా

-

గత కొన్ని నెలలుగా, భారతదేశంలో ఆన్‌లైన్ మోసాల కేసులు బాగా పెరిగాయి. స్కామర్లు ప్రజలను మోసగించడానికి మరియు సందేహించని వ్యక్తుల నుండి డబ్బును స్వాహా చేయడానికి వివిధ పద్ధతులను ఉపయోగిస్తున్నారు. ఇటీవల మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన ఓ మహిళ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ స్కామ్‌లో రూ.15 లక్షలు పోగొట్టుకుంది.

Hyderabad woman loses Rs 39 lakh in cyber fraud - The Statesman

నాసిక్‌లోని కెనడా కార్నర్‌లో నివసిస్తున్న 44 ఏళ్ల మహిళను ఏప్రిల్ 25న ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ద్వారా తెలియని వ్యక్తి ఒకరు సంప్రదించారు. ఆ వ్యక్తి ఆమెకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అవకాశాన్ని అందించాడు. జాబ్‌ను పొందే క్ర‌మంలో ప‌లు బ్యాంకు ఖాతాల‌కు స్కామ‌ర్లు మ‌హిళ నుంచి డ‌బ్బును ట్రాన్స్‌ఫ‌ర్ చేయించుకున్నారు. ఆపై వ‌ర్క్‌ను అసైన్ చేసి దీనిపై పెద్ద మొత్తంలో రిట‌న్స్ వ‌స్తాయ‌ని మ‌భ్య‌పెట్టి మ‌రికొంత న‌గ‌దు ఆయా ఖాతాల్లో జ‌మ చేయించుకున్నారు.

 

స్కామ‌ర్ల‌ను మ‌హిళ పూర్తిగా న‌మ్మింద‌ని నిర్ధారించుకున్న త‌ర్వాత డాక్యుమెంటేష‌న్‌, ఇత‌ర టాస్క్‌ల పేరుతో పెద్ద‌మొత్తంలో డ‌బ్బు దండుకున్నారు. ప‌లు ఖాతాల్లో బాధితురాలి నుంచి రూ. 15 ల‌క్ష‌లు పైగా వ‌సూలు చేశారు. స్కామ‌ర్లు ప‌దేప‌దే డ‌బ్బు అడుగుతుండ‌టంతో మోస‌పోయాన‌ని గుర్తించిన బాధితురాలు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో ఈ వ్య‌వ‌హారం బ‌య‌ట‌ప‌డింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news