నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా- జగన్ ఆరోపణలపై మంత్రి గంటా సవాల్

-


అమరావతి(విశాఖ): తనపై వై.ఎస్.జగన్మోహనరెడ్డి చేస్తున్న భూ కుంభకోణ ఆరోపణలను నిరూపించాలని, అందుకు ఎక్కడైనా చర్చకు సిద్ధమని ఏపీ మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాస్ అన్నారు. విశాఖ ఆళ్వార్దాస్ స్టేడియంలో డాగ్ షోకు హాజరైన సందర్భంగా గంటా మీడియాతో మాట్లాడారు. అవినీతి కేసుల్లో వారం, వారం కోర్టుకి హాజరయ్యే వ్యక్తి ఎదుటివారిపై ఆరోపణలు చేయడం దారుణమని, జగన్ కానీ, అతని ప్రతినిధులు కానీ ఈ అంశంపై చర్చకు ఎక్కడకు రమ్మన్నా తాను సాక్ష్యాధారాలతో హాజరవుతానని రుజువుచేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని, రుజువు చేయకుంటే జగన్ ఏమి చేస్తారని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news