వాజ్ పేయి గతంలో సైకిల్ తొక్కేవారు.. ఎందుకో తెలుసా?

-

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి స్వర్గస్తులయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న బంధాన్ని, ఆయన చేసిన పనులను అందరూ నెమరు వేసుకుంటున్నారు. ఈనేపథ్యంలో ఆయన మేనకోడలు కాంతి మిశ్రా.. వాజ్ పేయి గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని తెలిపారు. వాజ్ పేయి అప్పట్లో సైకిల్ ఎక్కువగా తొక్కేవారట. ప్రధాని కావడానికి ముందు వాజ్ పేయి మధ్య ప్రదేశ్ లోని గ్వాలియర్ కు తన బాల్య స్నేహితులను కలవడానికి సైకిల్ పై వెళ్లేవారట. ఒకసారే కాదు.. చాలా సార్లు అలా సైకిల్ తొక్కుతూ వెళ్లి తన ఫ్రెండ్స్ ను కలిసేవారట. చివరిసారిగా అటల్ జీ… 2006 లో తన చాచాజీ పుట్టినరోజు సమయంలో గ్వాలియర్ కు వచ్చారని అదే ఆఖరు అంటూ కన్నీళ్ల పర్యంతమయ్యారు ఆయన మేనకోడలు కాంతి.

Read more RELATED
Recommended to you

Latest news