కేటిఆర్ తో ఫోటో దిగిన మంత్రి, టీడీపీ సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్…!

-

సింగపూర్ మంత్రి ఈశ్వరన్ గుర్తున్నారా మీకు…? అదేనండి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న సమయంలో ఆయన భారత్ ఎక్కువగా వస్తూ ఉండేవారు. అమరావతి కి చంద్రబాబు శ్రీకారం చుట్టిన తర్వాత సింగపూర్ ఒప్పందం చేసుకోవడంతో ఆయన పేరు ఎక్కువగా వినపడుతూ ఉండేది. చంద్రబాబు సింగపూర్ వెళ్ళినప్పుడు ఆయన కలవడం,

ఆయన సింగపూర్ నుంచి అమరావతికి రావడం, ఆర్టీజిఎస్ లో ఉండటం వంటివి చూసే వాళ్ళం. ఇప్పుడు ఆ మంత్రి కేటిఆర్ తో చేయి కలిపారు. అవును కేటిఆర్ తో కలిసి ఆయన ఫోటో దిగారు. అమరావతిలో పరిస్థితులు బాగోని నేపధ్యంలో తెలంగాణాలో పెట్టుబడులు పెట్టడానికి గాను సింగపూర్ ఆసక్తి చూపిస్తుంది. ప్రస్తుతం కేటిఆర్ దావోస్ పర్యటనలో ఉండగా ఆయన కేటిఆర్ ని కలిసారు.

ఇద్దరు కలిసి కాసేపు చర్చలు కూడా జరిపారు. దీనిపై ఇప్పుడు తెలుగుదేశ౦ సోషల్ మీడియా ఆవేదన వ్యక్తం చేస్తుంది. కేటిఆర్ అద్రుష్టవంతులు అంటూ వ్యాఖ్యానిస్తూ, గుడ్ లక్ కేటిఆర్, మీకు ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు కలిసి వచ్చాయని, మీకు మంచి భవిష్యత్తు ఉందని దీవిస్తున్నారు. అన్ని బాగుంటే మీతో చంద్రబాబు కూడా వచ్చే వారు అని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news