తిరుమల కొండ ఎవరు ముందు ఎక్కితే వారే కుర్రాళ్లు: బొత్సాకు అచ్చెన్నాయుడు సవాల్

-

ఆంధ్రప్రదేశ్‌ మంత్రి బొత్స సత్యనారయణకు మాజీ మంత్రి టిడిపి మాజీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు సవాల్‌ విసిరారు. ఇటీవల మంత్రి బొత్స సత్యనారయణ మీడియాతో మాట్లాడుతూ..టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ముసలివారు అయిపోయారంటూ సెటైర్లు వేశారు. దీనిపై అచ్చెన్నాయుడు స్పందిస్తూ ఘాటు విమ‌ర్శులు చేశారు.”ఎవరు యువకులు – ఎవరు ముసలివాళ్ళు: గౌరవ మంత్రివర్యులు శ్రీ బొత్స సత్యనారాయణ గారు – ప్రతి పక్ష నాయకుడు అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ముసలి వారు అయ్యారు అని వ్యంగ్యంగా ( ఒకరకంగా గేలిచేస్తూ) అవాకులు చవాకులు పేలుతున్నారు. ఎవరు ముసలి వాళ్ళో-ఎవరు యువకులో తేల్చటానికి ఒక చిన్న పోటీ పెడదాము.

బొత్స సత్యనారాయణ గారు ( ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ క్యాబినెట్ లోని ఏ మంత్రిగారైనా సరే ) చంద్ర బాబు గారి కన్నా ముందు కాలినడకన తిరుమల కొండ ఎక్కండి? ఎవరు ముందు ఎక్కితే వారు కుర్రోళ్ళు. మిగిలిన వారు ముసలోళ్ళు ! ఈ పోటీకి బొత్సగారూ సిద్ధమేనా ! పోటీకి సిద్ధంకాకపోతే ముసలివాణ్ణి అని పత్రికాసమావేశంలో ఒప్పుకోండి!” అని అన్నారు. ఆపై “ఐటీ వారి పంచనామా చూశాక తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు బుగ్గనా? హైలీ రెస్పెక్టెడ్ విజయసాయిరెడ్డి, మీరు రాయించింది, చెప్పింది అబద్ధమని మరోసారి తేలింది. క్విడ్ ప్రోకో, మీరు కొట్టేసిన 43 వేల కోట్ల నుంచి 2 వేల కోట్లు పంపితే వృద్ధులకు మీరు ఎత్తేసిన పింఛన్లను మేము చెల్లిస్తాం” అని కూడా మరో ట్వీట్ పెట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news