ప్రాణం పోయినా మాట తప్పని వ్యక్తి వైఎస్ జగన్: ఆమంచి

-

amanchi meets ysjagan in hyderabad

ప్రాణం పోయినా మాట తప్పని వ్యక్తి వైఎస్ జగన్ అని చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ పేర్కొన్నారు. ఆయన ఇవాళ టీడీపీకి రాజీనామా చేశారు. త్వరలోనే వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. టీడీపీకి రాజీనామా చేసిన అనంతరం.. జగన్ ను కలిశారు. తర్వాత మీడియాతో మాట్లాడిన ఆమంచి… తెలుగుదేశంలో కులం పిచ్చి ముదిరిపోయిందన్నారు. తనను రాజకీయంగా, సామాజికంగా ఇబ్బందులు కలిగించారన్న ఆమంచి… ఈ అంశాలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లానన్నారు.

amanchi meets ysjagan in hyderabad

రాష్ట్రానికి వైఎస్ జగన్ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. వైఎస్ జగన్ పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. ప్రజలకు నచ్చే విధంగా టీడీపీ లేదు. చంద్రబాబు మాటలు చూస్తే ఆయనకు పిచ్చి పట్టినట్టు ఉంది. చంద్రబాబుకు 70 ఏళ్లు వచ్చాయి. అల్జీమర్స్ వచ్చాయనే అనుమానం ఉంది. ఈరోజు ఒక మాట చెబుతారు.. రేపు ఇంకోమాట చెబుతారు. పసుపు కుంకుమ పేరును చంద్రబాబు చెడగొట్టారు. రీజన్ లేకుండా హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చాడు. చిన్న విషయం కోసం హైదరాబాద్ ను వదులుకున్నాడు. కాపు రిజర్వేషన్లపై రాజకీయం చేయడం తగదు.

నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రమేయం లేకుండా సీఎం నివాసంలో ఆయన పేషిలో ఇతర వ్యక్తులు జోక్యం చేసుకున్నారు. ప్రభుత్వాన్ని అతీతశక్తులు నడిపిస్తున్నాయి. పవన్ తో అనేక సార్లు చర్చించాను కానీ.. జనసేనలో చేరుతానని ఎన్నడూ చెప్పలేదు.. అంటూ ఆమంచి వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news