ఏపీ ప్రభుత్వ ఉద్యోగులను తిట్టిన చంద్రబాబు, ఆర్కే.. నా కొడుకులకు జీతాలివ్వడానికా?

-

ఆర్కే అయితే ఏకంగా ఆ నా కొడుకులను జీతాలివ్వడానికా? అంటూ దూషిస్తూ మాట్లాడాడు. ప్రభుత్వ ఉద్యోగులకు ఎంప్లాయిస్ బెనిఫిట్ పై సెంట్రల్ పీఆర్సీ అమలుపై చంద్రబాబు మాట్లాడటం.. అది అమలు చేయాలంటే వెయ్యి కోట్లు అవుతుంది అని చంద్రబాబు అనడం..

అబ్బబ్బబ్బ.. చంద్రబాబు, ఆయన తొత్తు రాధాకృష్ణ కలిసి ఏపీని ఎక్కడికి తీసుకెళ్దామనుకుంటున్నారు అసలు. నిన్న గాక మొన్ననే కదా వాళ్లిద్దరూ ఎన్టీఆర్ ను వాడూ.. వీడూ.. వాడి పేరు తీసేయాలి.. అంటూ మాట్లాడుకున్న వీడియోను చూశాం. వీళ్లకు ఎంత కొవ్వెక్కకుంటే ఆ మహానుభావుడిని పట్టుకొని వాడు, వీడు అంటారు అంటూ సోషల్ మీడియా మొత్తం వాళ్ల మీద ఫైర్ అయిన సంగతి తెలిసందే. తాజాగా వాళ్లిద్దరూ డిస్కస్ చేసుకున్న మరో వీడియో వైరల్ అయింది.

another video of chandrababu and radha krishna goes viral

ఈ వీడియోలో వాళ్లు ఏపీ ప్రభుత్వం ఉద్యోగులను తిట్టడం చూడొచ్చు. ఆర్కే అయితే ఏకంగా ఆ నా కొడుకులను జీతాలివ్వడానికా? అంటూ దూషిస్తూ మాట్లాడాడు. ప్రభుత్వ ఉద్యోగులకు ఎంప్లాయిస్ బెనిఫిట్ పై సెంట్రల్ పీఆర్సీ అమలుపై చంద్రబాబు మాట్లాడటం.. అది అమలు చేయాలంటే వెయ్యి కోట్లు అవుతుంది అని చంద్రబాబు అనడం.. వెంటనే రాధాకృష్ణ అందుకొని.. ఎటు తీసుకెళ్దాం అనుకుంటున్నారు రాష్ట్రాన్ని అందరూ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంతే. ఇదీ అంతే. ఇప్పటికే తడిసి మోపెడు అయింది. అయినా ఆ నా కొడుకులకు జీతాలు ఇవ్వడానికా జనాలు ట్యాక్స్ లు కట్టేది. సరే అది మీ ఇష్టం అనుకోండి.. అంటూ ఆర్కే అనడం… చంద్రబాబు వెంటనే అందుకొని మీరు చెప్పింది అన్నీ కరెక్టే కానీ.. అధికారం లేకపోతే మనం ఏం చేయలేం అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించడం చూస్తుంటే ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులపై వీళ్లకు ఎంత చిన్న చూపు ఉందో అర్థమవుతోంది. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు చంద్రబాబు, రాధాకృష్ణపై దుమ్మెత్తిపోస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news