ఏపీ బిజెపి సీనియర్ నేత ఆరోగ్యం విషమం…!

-

ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఇప్పుడు సామాన్య ప్రజలనే కాకుండా, రాజకీయ నాయకులను కూడా తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. బిజెపి సీనియర్ నేత, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు ఆరోగ్యం ఇప్పుడు విషమంగా మారింది. గత ఇరవై రోజుల క్రితం కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో విజయవాడ హెల్ప్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు ఆయన. పది రోజుల నుంచి వెంటిలేషన్ పై చికిత్స పొందుతున్నా ఆయన ఆరోగ్యం సాధారణ స్థితికి రాలేదు.

దీనితో ఆందోళనలో కుటుంబ సభ్యులు ఉన్నారు. పైడికొండల మాణిక్యాలరావు ఆరోగ్యపరిస్థితిపై బీజేపీ అధిష్టానం ఆరా తీసింది. ఆయన ఆరోగ్యంపై రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు బిజెపి అధిష్టానం కు నివేదిక ఇచ్చారు అని సమాచారం. ఆయనతో పాటుగా పలువురు బిజెపి నేతలు కూడా ఏపీలో కరోనా బారిన పడ్డారు. అయన త్వరగా కరోనా నుంచి కోలుకోవాలి అంటూ బిజెపి నేతలు ఆకాంక్షిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news