22 నుంచి సీఎం చంద్ర‌బాబు అమెరికా పర్యటన

-

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో అధికారిక బృందం ఈ నెల 22 నుంచి 28 వరకు అమెరికాలో పర్యటించనుంది. ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర, ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్‌, మరో ఆరుగురు అధికారులు ఈ బృందంలో ఉన్నారు. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం, బ్లూంబర్గ్‌ గ్లోబల్‌ బిజినెస్‌ ఫోరం సంయుక్తంగా నిర్వహించనున్న ‘సుస్థిర అభివృద్ధి-ప్రభావ సదస్సు’లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ఈ సదస్సు జరగనుంది.

న్యూజెర్సీలో తెదేపా బహిరంగసభ

అమెరికా పర్యటన ఉన్న నేపథ్యంలోనే ఎన్నారై తెలుగుదేశం ఆధ్వర్యంలో నిర్వహించే బహిరంగ సభను న్యూజెర్సీలో నిర్వహించనున్నారు. నెవార్క్‌ నగరంలోని న్యూజెర్సీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ వెల్‌నెస్‌ కేంద్రంలో ఈ నెల 23న సభ జరగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news