మహిళలపై ఏపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు…!

-

మహిళలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి ధర్మాన కృష్ణదాస్ సంచలన వ్యాఖ్యలు చేసారు. శనివారం మాట్లాడిన ఆయన మహిళల ఆహార్యం పై కాస్త నోరు జారారు. మహిళల కట్టుబొట్టు సరిగ్గా ఉంటే కురాళ్లు ఎందుకు అల్లరి చేస్తారని మహిళలను ఉద్దేశించి ప్రశ్నించారు. కట్టుబొట్టు సక్రమంగా లేకపోతేనే కుర్రాళ్లు అల్లరి చేస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. అక్కడితో ఆగని మంత్రి ధర్మాన మరిన్ని వ్యాఖ్యలు చేసారు.

మహిళలు సాంప్రదాయంగా ఉంటేనే గౌరవంగా ఉంటుందని సూచించారు. మన తప్పులు ఉంటేనే ఎవరైనా అల్లరి చేస్తారని మహిళలను ఉద్దేశించి అన్నారు. ఇదిలా ఉంటే మహిళల భద్రతపై గత కొంత కాలంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపధ్యంలో వారి వస్త్ర ధారణ గురించి చర్చ జరుగుతుంది. చాలా వరకు కొంత మంది మహిళల వస్త్రధారణపై విమర్శలు చేస్తున్నారు. వారి ఆలోచనా ధోరణి మారాలి అంటూ సూచిస్తున్నారు.

కొంత మంది మహిళల వేసే వస్త్రాలు వివాదాస్పదంగా ఉన్నాయని, వాళ్ళను చూసే కుర్రాళ్ళు రెచ్చిపోతున్నారని, టీ షర్టులు సహా కొన్ని మరీ అసభ్యంగా ఉంటున్నాయని కొందరు వ్యాఖ్యానించడం గమనార్హం. అయితే ఫ్యాషన్ పెరగడంతో కొందరు మహిళలు వేసే దుస్తులు కాస్త అసభ్యంగా ఉంటున్నాయని విమర్శలు వస్తున్నాయి. అయినా సరే వాళ్ళల్లో మార్పు రావడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో మంత్రి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news