పాదయాత్రతో తెలంగాణలో రాజకీయ ప్రకంపనలే : బండి సంజయ్

-

తను నిర్వహించే పాదయాత్రతో తెలంగాణ లో రాజకీయ ప్రకంపనలు ఖాయమని తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర ప్రజా సంగ్రామహ పేరుతో నిర్వహిస్తున్న పాదయాత్రను బండి సంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … తెలంగాణ ప్రజల్లో ఆత్మస్థైర్యం ఇవ్వడానికి పాదయాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఇవాళ్టి నుంచి ప్రతి రోజూ 10 కిలో మీటర్ల చొప్పున… 34 రోజుల పాదయాత్ర నిర్వహిస్తామని వెల్లడించారు బండి సంజయ్. కేసీఆర్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ పాదయాత్ర కొనసాగుతుందన్నారు బండి సంజయ్. తాలిబాన్ భావజాలం ఉన్న ఎంఐఎంను.. దానికి సహకరిస్తున్న పార్టీ లను తరిమి తరిమి కొడతామని పిలుపు నిచ్చారు. భాగ్యలక్ష్మి దేవాలయం ఎవడి అడ్డ కాదు…. కాషాయ జండా పట్టుకొని ఏ గల్లీ కైనా వస్తామని స్పష్టం చేశారు. గల్లీ మాది… తెలంగాణ మాదని స్పష్టం చేశారు బండి సంజయ్‌.

Read more RELATED
Recommended to you

Latest news