కేసీఆర్ డల్లాస్, కేటిఆర్ విశ్వానగరం ఎక్కడ…?

-

రాష్ట్రం వర్షాలకు హైదరాబాద్ వెనిస్ నగరం లా కనిపించిందని కాంగ్రెస్ శాసన సభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కేసీఆర్ ఇస్తాంబుల్, డల్లాస్ చేస్తామన్నారు, కేటీఆర్ విశ్వనగరం అన్నారు ఏమైంది? అని ప్రశ్నించారు. 72 వేల కోట్ల అభివృద్ధి ఎటు పోయిందని అన్నారు. టిఆర్ఎస్ ను దూరం పెట్టి నగరాన్ని కాపాడుకోవాలి అని ఆయన పిలుపునిచ్చారు. కల్వకుర్తి ప్రాజెక్టు పంపు హౌజ్ మునకకు గత ప్రభుత్వం కారణం అనడానికి సిగ్గుండాలని ఆయన ఎద్దేవా చేసారు.

పాలమూరు ప్రాజెక్టులో అండర్ గ్రౌండ్ పంప్ హౌజ్ నిర్మించొద్దని నిపుణుల కమిటీ చెప్పిందని, అండర్ గ్రౌండ్ బ్లాస్ట్ లతో కల్వకుర్తి కి నష్టం జరుగుతుందని చెప్పారని పేర్కొన్నారు. కేవలం కాంట్రాక్టర్లకు లబ్ది కోసం అండర్ గ్రౌండ్ పంప్ హౌజ్ నిర్మాణం చేపట్టారని, తన అనుకూలమైన ఈఎన్సీ కి ఎక్స్ట్రెంషన్ ఇచ్చి ఇర్రిగేషన్ శాఖను సర్వనాశనం చేశారని విమర్శించారు. ఈఎన్సీ మురళీధర్ రావు ఇచ్చిన అన్ని పనుల పై విచారణ జరిపించాలని డిమాండ్ చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news