సీఎం కేసీఆర్ శ్రీ‌రామ న‌వ‌మి శుభాకాంక్ష‌లు

-

రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శ్రీ రామనవమి శుభాకాంక్షలు తెలిపారు.భద్రాచలంలో సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నదని సీఎం తెలిపారు. “ధర్మో రక్షతి రక్షితః” సామాజిక విలువను తు.చ. తప్పకుండా ఆచరించి, ధర్మాన్ని విలువలను కాపాడేందుకు తన జీవితాన్నే త్యాగం చేసిన మహోన్నత ప్రజా పాలకుడు సీతారామ చంద్రుడు భారతీయుల ఇష్ట దైవమని సీఎం కీర్తించారు.

లోక కళ్యాణం కోసం ఎన్నో త్యాగాలకోర్చిన సీతారాముల పవిత్ర భార్యాభర్తల బంధం అజరామరమైనదని, భవిష్యత్ తరాలకు ఆదర్శనీయమైనదని సీఎం తెలిపారు. భద్రాచల సీతారాముల వారి ఆశీస్సులు సదా రాష్ట్ర ప్రజలకు ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవనం సాగించేలా దీవించాలని శ్రీ సీతారాములను సీఎం ప్రార్థించారు.

Read more RELATED
Recommended to you

Latest news