సుశాంత్ చావుని మేము వాడుకోవట్లేదు: బిజెపి క్లారిటీ

-

రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం ఓటు బ్యాంకు సమస్య కాదని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ శుక్రవారం స్పష్టం చేసారు. సుశాంత్ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా దర్యాప్తు జరగాలని ఆయన అన్నారు. ముంబైలో నటి కంగనా రనౌత్ కార్యాలయాన్ని ధ్వంసం చేయడం అనేది రాజకీయ కుట్ర అని ఆయన ఆరోపించారు.

“మహారాష్ట్ర ప్రభుత్వ చర్య సుశాంత్ సింగ్ రాజ్‌ పుత్ మరణం తరువాత కంగనాపై ప్రతీకారం తీర్చుకున్నట్లు అనిపించింది. మహారాష్ట్ర చరిత్రలో ఇటువంటి ఎప్పుడు విషయాలు జరగలేదని ఆయన అన్నారు. బిజెపికి బీహార్ అసెంబ్లీ ఎన్నికల బాధ్యతలు నిర్వహిస్తున్న ఫడ్నవీస్, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నాయకత్వంలో బీహార్‌ లో జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఐక్యమైందని, జనతాదళ్- యునైటెడ్ మరియు లోక్ జనశక్తి మధ్య విభేదాలు ఉన్నాయని అవి త్వరలోనే సమసిపోతాయని విశ్వాసం వ్యక్తం చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news