రవీంద్ర జడేజా సతీమణికి బీజేపీ టికెట్‌..?

-

సెలబ్రిటీలు రాజకీయాల్లోకి రావడం సహజం. ఇప్పటికే చాలా మంది సినీ తారలు, క్రికెటర్లు కీలక పదవుల్లో ఉన్నారు. కానీ తాజాగా ఓ క్రికెటర్ భార్య రాజీయాల్లో ఎంట్రీ ఇస్తున్నారు. ఇంతకు ఆమె ఎవరంటే.. టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ రవీంద్ర జడేజా సతీమణి రీవాబా జడేజా.

ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్‌లో కొద్దిరోజుల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు దేశ రాజకీయాలను ఆకర్షిస్తున్నాయి. అధికార బీజేపీని ఢీకొట్టేందుకు ఆప్‌ విస్తృత ప్రచారం చేస్తోంది. ఈ క్రమంలో గుజరాత్ బీజేపీ  అభ్యర్థుల తుది జాబితాలో టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రీవాబా జడేజా పేరు వినిపిస్తోంది. ఆమెకు టికెట్ దక్కే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

రీవాబా జడేజా మెకానికల్ ఇంజినీర్‌. ఆమె 2016లో రవీంద్ర జడేజాను వివాహం చేసుకున్నారు. రాజ్‌పుత్ వర్గానికి చెందిన కర్ణిసేన నాయకురాలైన ఈమె.. మూడు సంవత్సరాల క్రితం బీజేపీలో చేరారు. ప్రముఖ రాజకీయనేత హరి సింగ్‌ సోలంకికి రీవాబా దగ్గరి బంధువు.

Read more RELATED
Recommended to you

Latest news