తేలు కుట్టిన దొంగలు ఎవరో త్వరలోనే అర్థమవుతుంది.. జ‌గ‌న్‌పై బుద్ధా హాట్ కామెంట్స్‌

-

వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మ‌ధ్య ట్విట‌ర్ వేదిక‌గా ఎప్ప‌టిక‌ప్పుడు మాట‌ల యుద్ధం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్ద అప్పట్లో పర్సనల్ సెక్రెటరీగా పనిచేసిన పెండ్యాల శ్రీనివాస్ ఇంట్లో జరిగిన ఐటీ సోదాలు గురించి విజ‌య్ సాయి రెడ్డి ‘తన మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇళ్లపై ఐటీ దాడుల గురించి నోరు మెదపకుండా తేలుకుట్టిన దొంగలా ఉన్న చంద్రబాబు ఏబీవీ సస్పెన్షన్‌పై మాత్రం కాస్త ధైర్యం తెచ్చుకుని మాట్లాడాడు. అధికారులపై ఫ్యాక్షన్ వేధింపులకు పాల్పడుతున్నారని అక్కసు వెళ్లగక్కాడు.

వాళ్లకు ఏ పాపం తెలియదని మాత్రం అనలేకపోయాడు’ అని విమర్శిస్తూ ట్వీట్ చేశారు. అయితే దీనికి కౌంట‌ర్ ఇచ్చారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. తేలు కుట్టిన దొంగలు ఎవరో త్వరలోనే అర్థమవుతుందని, రూ.43 వేల కోట్ల ప్రజాధనం దోచిన వైఎస్ జగన్ గారూ, ఐటీ రైడ్స్ గురించి మీరు మాట్లాడడం ఈ సంవత్సరానికే అత్యుత్తమ జోక్ అంటూ టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శించారు. ఈ సందర్భంగా బుద్ధా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై వ్యంగ్యం ప్రదర్శించారు. విజయసాయిరెడ్డి గారూ, మీరు ఇచ్చిన సమాచారంతో ఐదు రోజుల పాటు తవ్వి, తవ్వి ఎలుకను పట్టారు. ఆ ఎలుకను మీకు గిఫ్టుగా పంపారట, ఇంకా మీకు చేరలేదా? అంటూ ట్విట్టర్ లో ఘాటుగా స్పందించారు.

Read more RELATED
Recommended to you

Latest news