చంద్రబాబు అరెస్ట్.. సిల్క్ డెవలప్ మెంట్ టూ సీఐడీ వయ్యా నంద్యాల

-

ఈ శనివారం ఉదయం చంద్రబాబు చేసిన స్కామ్ బయటపడడంతో రాష్ట్రమంతా ఉలిక్కి పడింది. ఇక అప్పటి నుంచి ఒక్కో విషయం బయటపడుతుంటే 5 కోట్ల మంది ఆంధ్రులతో పాటు పక్కరాష్ట్రాల్లోని వారు కూడా విస్తుపోతున్నారు. నిరుద్యోగుల జీవితాల చాటున ఇన్ని కోట్ల రూపాయల స్కామ్ చేశారా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ కేసులో ఇంత స్కామ్ చేసినందుకు గాను నేడు చంద్రబాబునాయుడిని నంద్యాలలో అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో అసలు ఈ కేసు పూర్తి వివరాలు తెలుసుకుందాం..

అసలేంటీ స్కిల్క్ డెవలప్ మెంట్..

2015లో యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం 3,350 కోట్ల రూపాయల ప్రాజెక్టుకు ఒప్పందం కుదుర్చుకుంది. జర్మనీకి చెందినటువంటి సీమెన్ అనే సంస్థ ద్వారా యువతకు శిక్షణ ఇస్తామని ప్రకటించారు. అయితే ఈ ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వం పది శాతం వాటా చెల్లించాల్సి ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లింపుల్లో ఏకంగా 241 కోట్ల రూపాయల్ని దారి మళ్లించారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే నకిలీ బిల్లులు, ఇన్‌వాయిస్‌ల ద్వారా జీఎస్టీకి గండి కొట్టారనే అభియోగాలు సైతం ఉన్నాయి.

అసలెలా బయటపడిందంటే..

2015 జూన్‌లో స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఆర్థికలావాదేవీల్లో అవకతవకలు జరిగినట్లు గుర్తించింది. జీవో నెంబర్ 4 ప్రకారం సీమెన్స్‌ ఎండీ సౌమ్యాద్రి శేఖర్‌ బోస్, డిజైన్‌ టెక్‌ ఎండీ వికాస్‌ కన్విల్కర్‌కు గత ప్రభుత్వం రూ.241 కోట్లు కేటాయించిందని.. ఉద్దేశపూర్వకంగా ఈ సొమ్ము అప్పగించిందని వెల్లడించింది. అయితే ఈ సొమ్మును 7 షెల్‌ కంపెనీలకు తప్పుడు ఇన్‌వాయిస్‌లు సృష్టించినట్టు తరలించారని తెలిపింది. అలాగే ఈ ప్రాజెక్టు వ్యయాన్ని టెక్నాలజీ కంపెనీలు.. ప్రభుత్వానికి విభజించడంలో అవకతవకలు జరిగాయని సీఐడీ పేర్కొంది. 2017-18లో రూ.371 కోట్లలో.. రూ.241 కోట్లు గోల్‌మాల్‌ జరిగాయని సీఐడీ రిమాండ్‌ రిపోర్ట్‌లో వెల్లడించింది. ఆశ్చర్యంగా అటు సీమెన్ సంస్థ కూడా అంతర్గత విచారణ జరిపి 164 సీఆర్పీసీ కింద ఏకంగా మేజిస్ట్రేట్ వాగ్మూలం ఇచ్చింది.

3 ఏళ్లుగా సాగుతూనే ఉన్న విచారణలు..

గతంలోనే స్కిల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ ఛైర్మన్, డైరెక్టర్ సహా పలువురిపై కేసులు నమోదయ్యాయి. దీనిపై వైసీపీ ప్రభుత్వం 2021 జులైలో సీఐడీ విచారణకు ఆదేశించింది. అయితే ఈ సీఐడీ నివేదిక ఆధారంగా ఆర్థిక లావాదేవీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దృష్టి సారించింది. ఈ కేసులో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ మాజీ ఎండీ, సీఈవో గంటా సుబ్బారావు, డైరెక్టర్‌ కె.లక్ష్మీనారాయణలతో పాటు.. 26 మందిపై సీఐడీ గతంలో కేసు నమోదు చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా విశ్రాంత ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణను సీఐడీ అధికారులు విచారించారు. ఎందుకంటే లక్ష్మీనారాయణ గతంలో చంద్రబాబుకు ఓఎస్డీగా పనిచేశారు. పదవీ విరమణ తర్వాత ఏపీ ప్రభుత్వానికి లక్ష్మీనారాయణ సలహాదారుగా పనిచేశారు. అలాగే ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు మొదటి డైరెక్టర్‌గా కూడా ఆయన పనిచేశారు.

Read more RELATED
Recommended to you

Latest news