మళ్ళీ అదే సెట్టింగ్.. ఆ సీన్ గుర్తుచేస్తున్న బాబు..!

-

నలభై ఏళ్లపైనే రాజకీయ అనుభవం ఉన్న టి‌డి‌పి అధినేత చంద్రబాబుకు…రాజకీయాల్లో ఎప్పుడూ ఎలాంటి ఎత్తులు వేసి, ప్రత్యర్ధులని చిత్తు చేయాలో బాగా తెలుసు. అయితే ఒకప్పుడు బాబు వ్యూహాలు వర్కౌట్ అయ్యాయి కానీ…ఇప్పుడు వర్కౌట్ అయ్యే పరిస్తితి కనిపించడం లేదు. ఇప్పుడు పూర్తిగా రాజకీయాలు మారాయి…అందుకు తగ్గట్టుగా బాబు కూడా మారాలి. కానీ అదే ఓల్డ్ ఫార్మాట్‌లో పాలిటిక్స్ చేస్తే ప్రజలు పట్టించుకునే పరిస్తితి ఉండదు.

chandrababu naiduఇప్పుడు ఆయన ధర్మగ్రహ దీక్ష పరిస్తితి కూడా అంతే…వైసీపీ శ్రేణులు టి‌డి‌పి కార్యలయంపై దాడికి నిరసనగా చంద్రబాబు…ఆఫీసులోనే 36 గంటల పాటు నిరసన దీక్షకు దిగారు. అయితే ఇక్కడ దీక్ష చేస్తున్నారో….లేక నేతల చేత భజన చేయించుకుంటూ….జగన్‌ని తిట్టిస్తున్నారో అర్ధం కాదు. సరిగ్గా ఈ దీక్ష మాదిరిగానే…2019 ఎన్నికల ముందు చంద్రబాబు ధర్మపోరాట దీక్షలని చేశారు.

కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిందని చెప్పి, ప్రభుత్వ సొమ్ముతో ఎడాపెడా ధర్మపోరాట దీక్షలు పెట్టేశారు. ఆ దీక్షల్లో ఏం ఉండదు…నాలుగు మంచి సోఫా సెట్లు, చుట్టూ నాలుగు ఏసీ కూలర్లు…సోఫాలో బాబు కూర్చోవడం వరుసపెట్టి టి‌డి‌పి నేతలు, కార్యకర్తలు ఆయనకు దండం పెట్టి, సెల్ఫీలు దిగడం…అలాగే బాబుని ఆహా ఓహో అంటూ పొగడటం…మోడీని తిట్టడం. ఇక ఈ సెట్టింగ్‌లు వల్ల బాబుకు ఎంత డ్యామేజ్ జరిగిందో చెప్పాల్సిన పని లేదు. అధికారం కూడా కోల్పోయారు.

అయినా సరే బాబు మారడం లేదు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా సేమ్ సెట్టింగ్ పెట్టుకుని, ధర్మగ్రహ దీక్ష అంటున్నారు. ఇక దీక్షలో అదే సీన్. దీంతో జనం నవ్వుకునే పరిస్తితి ఉంది. దీని వల్ల డబ్బులు బొక్క తప్ప, పార్టీకి ఒరిగే ప్రయోజనం లేదు. అలాగే వైసీపీకి జరిగే డ్యామేజ్ లేదు. ఏ విషయమైన ప్రజల్లోకి వెళ్ళి పోరాడాలి…అలా కాకుండా ఏసీల మధ్య సోఫా బెడ్లపై కూర్చుని దీక్ష చేస్తానంటే పావలా ప్రయోజనం ఉండదు.

Read more RELATED
Recommended to you

Latest news