ఇళ్ల పట్టాల కోసం కొత్త పథకం : 67 లక్షల మందికి లబ్ది

-

గృహనిర్మాణం, ఉపాధిహామీ పనులు, వైయస్సార్‌ అర్బన్‌ క్లినిక్స్, గ్రామ, వార్డు సచివాలయాల్లో తనిఖీలు, కోవిడ్‌ సహా సీజనల్‌ వ్యాధులు, దిశా యాప్, వ్యవసాయం, అక్టోబరులో నెలలో అమలు చేయనున్న పథకాలపై ఇవాళ సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైస్ జగన్ మాట్లాడుతూ…. ఇళ్లపట్టాల పంపిణీ పై కోర్టుల్లో పెండింగ్‌ కేసుల పై దృష్టిపెట్టాలని… గత వీడియో కాన్ఫరెన్స్‌లో 834 కేసులు ఉంటే.. ఇవ్వాళ్టికి 758కి కేసులు తగ్గాయన్నారు. 76 కేసులు పరిష్కారం అయ్యాయని.. దాదాపుగా 8వేల మందికి దీనివల్ల మేలు జరిగిందని తెలిపారు. లే అవుట్‌ వారీగా, ప్లాట్ల వారీగా లబ్ధిదారుల వివరాలను తెలియజేస్తూ మ్యాపింగ్‌ చేశామని… మిగిలిపోయిన 12.6శాతం మ్యాపింగ్‌ పనులను కలెక్టర్లు వెంటనే పూర్తిచేయాలని తెలిపారు.

Jagan
Jagan

1,48,398 మందికి పట్టాలు ఇవ్వడానికి కొత్తగా భూసేకరణ చేయాల్సి ఉందని… ఒన్‌టైం సెటిల్‌మెంట్‌ పథకానికి జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంగా పేరు మార్పు చేశామని వెల్లడించారు. ఈ పథకంలో రిజిస్ట్రేషన్‌ పట్టాలు ఇచ్చే కార్యక్రమం కూడా డిసెంబర్‌లో చేయాలని… దాదాపుగా 67 లక్షలమందికి మేలు జరుగుతుందని స్పష్టం చేశారు. 1980 లనుంచి 2011 వరకూ ఉన్న అన్ని ఇళ్లు, ఇంటి స్థలాలను విడిపించుకునేలా అవకాశం ఇస్తున్నామని.. ఆ ఆస్తులపై వారికి పూర్తి హక్కులు వస్తాయన్నారు.

పేదలందరికీ ఇళ్ల పథకలో భాగంగా మొదటి విడతలో 15. 6 లక్షల ఇళ్లు కడుతున్నామని స్పష్టం చేశారు. ఇప్పటివరకూ 10.31 లక్షల ఇళ్లు గ్రౌండ్‌అయ్యాయని వెల్లడించారు. ఆప్షన్‌ –3ని ఎంపిక చేసుకున్న ఇళ్ల పనులు అక్టోబరు 25 నుంచి మొదలుపెట్టడానికి అన్నిరకాల చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే 2.25 లక్షల లబ్ధిదారులతో 18,483 గ్రూపులు ఏర్పాటు చేశారని… ఈ నెలాఖరు కల్లా గ్రూపుల ఏర్పాటు పూర్తికావాలని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news