రాష్ట్ర ప్రజలకు సిఎం జగన్ శుభాకాంక్షలు…!

-

దీపావళి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సిఎం జగన్ శుభాకాంక్షలు చెప్పారు. ప్రజల జీవితాల్లో దీపావళి కోటి కాంతులు నింపాలి అని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. ప్రతి ఇంటా ఆనందాల దీపాలు వెలగాలి అని ఆయన పేర్కొన్నారు. దీపావళి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

చీకటి మీద వెలుగు, చెడు మీద మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని ఆయన ఒక ప్రకటనలో తెలియజేసారు. ఈ పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని, ప్రతి ఇంటా కోటి ఆనందాల దీపాలు వెలగాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆకాంక్షించారు.

Read more RELATED
Recommended to you

Latest news