ట్రంప్ ఇండియా లో  ఎప్పుడు ఎలా ఎక్కడికి వెళ్లాలో డిసైడ్ చేస్తోంది వీళ్ళే ..

-

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు రాజకీయ వ్యవహారాలను ఎక్కువగా చూసుకునేది ఆయన కూతురు ఇవాంకా ట్రంప్ మరియు అల్లుడు కుష్నర్. డోనాల్డ్ ట్రంప్ 2016 అగ్రరాజ్యం ఎన్నికల సమయములో అల్లుడు కుష్నర్ దగ్గరుండి ప్రచార బాధ్యతలు అన్నిటిని పర్యవేక్షించడం జరిగింది. ఆ తర్వాత డోనాల్డ్ ట్రంప్ అమెరికాకి అధ్యక్షుడిగా గెలిచిన కొన్నాళ్లకు రాజకీయ సలహాదారుగా కుష్నర్ ను – ఆ తర్వాత ఇవాంకను సీనియర్ అడ్వయిజర్ గా నియమించడం జరిగింది.

చాలా వరకు డోనాల్డ్ ట్రంప్ కీలక బాధ్యతలను అల్లుడు కుష్నర్ దగ్గరుండి చూసుకుంటాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం డోనాల్డ్ ట్రంప్ ఇండియా పర్యటనలో కూడా ఎప్పుడు ఎలా ఎక్కడికి వెళ్లాలో డిసైడ్ చేస్తుంది కూడా అల్లుడు కుష్నర్ మరియు కూతురు ఇవాంక.

 

2017 వ సంవత్సరం లో ఇవాంక ఇండియా లో జరిగిన గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూయర్ సమావేశానికి వచ్చారు. దీంతో అప్పటి నుండి భారత్ తో మంచి సంబంధాలు కొనసాగించడంతో తాజాగా తండ్రి డోనాల్డ్ ట్రంప్ పర్యటన అంత కూతురు ఇవాంకా మరియు అల్లుడు కుష్నర్ కనుసన్నల్లో జరుగుతుంది. 

Read more RELATED
Recommended to you

Exit mobile version