రాబోయే కాలంలో అసెంబ్లీపై ఎగిరే జెండా బీజేపీదే: ఈటెల రాజేందర్

-

స్పీకర్ ను అడ్డుపెట్టుకుని మా హక్కులను హరించేందుకు ప్రయత్నిస్తున్నారని సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. బీజేపీ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కేసీఆర్ ఒక్కరే తెలంగాణ కోసం పోరాడితే మేమంతా కలిసి రాష్ట్రాన్ని సాధించుకున్నామని.. ఇప్పుడు మేం ముగ్గురం ఎమ్మెల్యేలమే కావచ్చు కానీ… రాబోయే కాలంలో అసెంబ్లీపై ఎగిరేగి బీజేపీ జెండానే అని అన్నారు. ఖచ్చితంగా  తెలంగాణ వ్యాప్తంగా ప్రజానీకం మావైపు ఆసక్తిగా చూస్తున్నారని.. తెలంగాణలో వీఆర్ఓల సమస్యల కానీ.. నిరుద్యోగులు సమస్య కానీ, మహిళా సమస్యలు కానీ, బెల్ట్ షాపుల వల్ల అనేక మంది మహిళల పుస్తెలు తెగుతున్నాయని ఆయన విమర్శించారు. ఈ రాష్ట్రంలో నియంత్రుత్వ పాలన కొనసాగుతోందని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రి ఇప్పటికైనా ఆలోచించాలని… ఏ రాజ్యాంగం అయితే మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చేసిందో.. ఇతర సభ్యలుకు ఉన్న హక్కులను కూడా గౌరవించాలని, భారత ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని బీజేపీ తరుపున డిమాండ్ చేస్తున్నామని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news