ఎమ్మెల్యే పేరు రాసి చచ్చిపోతాం: మహిళలు

-

హైదరాబాద్ లో వరదల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. వరదలు అదుపులోకి వచ్చినా సరే కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి చాలా భయంకరంగా ఉంది అని స్వయంగా పోలీసులే చెప్తున్నారు. నాయకులు కూడా పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ వాస్తవ పరిస్థితి తెలుసుకుంటున్నారు. కాని ప్రజల్లో మాత్రం ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. తాజాగా ఎమ్మెల్యేకి చేదు అనుభవం ఎదురైంది.

TELANGANA RASHTRA SAMITI amblem

ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. వరద ప్రాంతలలో పర్యటిస్తున్న టిఅర్ఎస్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డితో స్థానిక మహిళలు గొడవకు దిగారు. మీ పేరు రాసి చ‌నిపోతాం అంటూ ఎమ్మెల్యే పై ఆగ్రహం వ్యక్తం చేసారు. వరదల్లో చిక్కుకున్న తమని ఎవరు ఆదుకోవడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేసి, ఎమ్మెల్యే తిరిగి వెళ్లిపోవాలి అంటూ డిమాండ్ చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news