బీజేపీ పార్టీ లో గ్రూపిజం ని ఆపండి… కలకలం రేపుతున్న రాజాసింగ్ వాట్సాప్ మెసేజ్…!

-

తెలంగాణాలో బలపడాలి అని భావిస్తున్న బిజెపి లో ఇప్పుడు రాష్ట్ర కమిటీ ఏర్పాటు వ్యవహారం సంచలనంగా మారింది. ఈ వ్యవహారంపై ఇప్పుడు సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతుంది. తాజాగా గోషా మహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కి వాట్సాప్ మెసేజ్ పంపించారు. రాష్ట్ర కమిటీ ఏర్పాటు లో  రాష్ట్ర బిజెపిలో ఉన్న ఏకైక ఎమ్మెల్యే అయిన తన అభిప్రాయం తీసుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.

ఇంకా నా నియోజకవర్గ నుండి కమిటి లో ఎవరిని తీసుకోలేదు.. ఒక్కరు కూడా సమర్థులు లేరా అని ఆయన నేరుగా ప్రశ్నించారు. బీజేపీ లో మరో సారి నన్ను సైడ్ లైన్ చేశారని ఆవేదన వ్యక్తం చేసారు. మీ నాయకత్వం లో బీజేపీ లో చేంజ్ వస్తుందని అనుకున్న కానీ కనిపించడం లేదని ఆయన మండిపడ్డారు. పార్టీ లో గ్రూపిజంని ఆపండి… కలిసి పని చేద్దామని ఆయన బండి సంజయ్ కి పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news