బ్రేకింగ్: ఢిల్లీకి ఏపీ మంత్రి, కారణం అదే…!

-

రేపు ఢిల్లీ కి ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ వెళ్లనున్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు వైసీపీ ఎంపీలతో కలిసి కేంద్ర జలశక్తి మంత్రి ని కలవనున్న మంత్రి అనిల్ కుమార్… పలు కీలక అంశాల గురించి చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రానికి రావాల్సిన పోలవరం ప్రాజెక్టు నిధులు తదితర ప్రాజెక్టుల అంశాలు పై కేంద్ర జలశక్తి మంత్రి తో చేర్చించనున్న అనిల్ కుమార్ ఈ మేరకు నిధులు కూడా ఇవ్వాలని కోరే అవకాశం ఉంది.

ఇక కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్ట్ ల గురించి ఆయన వివరించే అవకాశం ఉంది. రాష్ట్రానికి రావాల్సిన సాగునీటి ప్రాజెక్ట్ ల నిధులను ఆయన అడగనున్నారు. ఇప్పటికే మంత్రికి సిఎం జగన్ పలు సూచనలు కూడా చేసారు. ఇక వ్యవసాయ శాఖ అధికారులు, జలవనరుల శాఖ అధికారుఅతో కలిసి ఆయన ఢిల్లీ వెళ్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news