బీజేపీ ఎం చేసినా రైట్…? మరీ ఇంత నీచమా…?

-

దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేక ఉద్యమం విషయంలో బిజెపి నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారుతున్నాయి. ఉద్యమాలు చేస్తున్న వారిని నీచంగా మాట్లాడుతూ హిందూ ఓటు బ్యాంకు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కనీసం వారి డిమాండ్లు ఏంటీ వాళ్ళకు కావాల్సిన భరోసా ఏంటీ అనేది కూడా అడగడం లేదు.

ప్రధానంగా ఢిల్లీలోని షాహీన్ బాగ్ లో నిరసన చేస్తున్న వాళ్ళను మరీ నీచంగా మాట్లాడుతున్నారు బిజెపి నేతలు. ఒకరు ఏమో దొంగలు అని మాట్లాడుతుంటే, మరికొందరు కాల్చి చంపాలని మాట్లాడుతున్నారు. మరి కొందరు రేపిస్ట్ లు అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏకంగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులతో పోల్చారు బిజెపి నేతలు. ఢిల్లీని సిరియా చేస్తున్నారు అంటూ మాట్లాడుతున్నారు.

తాజాగా ఒక బిజెపి నేత ఢిల్లీలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఉన్నారని వాళ్ళు షాహీన్ బాగ్ సహా ఢిల్లీని సిరియా చేస్తున్నారు అని మాట్లాడారు. సోషల్ మీడియాలో ఈ కామెంట్స్ వైరల్ అయ్యాయి. కనీసం ఆందోళన చేస్తున్న వారి పట్ల ఒక బాధ్యత కూడా లేకుండా అధికారంలో ఉన్నారని మాట్లాడుతున్న మాటలు ఆందోళన కలిగిస్తున్నాయి. హిందు ఓటు బ్యాంకు కోసం ప్రయత్నాలు చేయడంలో తప్పు లేదు.

కాని నిరసన చేస్తున్న వాళ్ళను నీచంగా మాట్లాడటం దారుణం. కుక్కల్ని కాల్చి చంపాలని మాట్లాడటం, దానిని మరో నాయకుడు సమర్ధించడం, మిమ్మల్ని అమిత్ షా, మోడీ కూడా కాపాడలేరు అని చెప్పడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. బిజెపి ఏది చేసినా సమర్ధనీయం… వ్యతిరేకించిన వాడు ఏది చేసినా తప్పు అన్నట్టు ఉంది వాళ్ళ వైఖరి. సమస్యకు పరిష్కారం దిశగా అడుగులు వేయకపోయినా నష్టం లేదు గాని ఈ విధంగా మాట్లాడటం మాత్రం హింసను ప్రేరేపించడమే.

Read more RELATED
Recommended to you

Latest news