జ‌గ‌న్ పాద‌యాత్ర న‌వంబర్ 3 కు వాయిదా

-

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రను నవంబర్‌ 2వతేదీ వరకు వాయిదా వేస్తున్నట్లు వైఎస్సార్‌ సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్‌ తెలిపారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో ‘‘ విశాఖ విమానశ్రయంలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చికిత్స చేసిన వైద్యులు నివేదికను ఈ రోజు అందజేశారు.

విశాఖ ఎయిర్‌పోర్టులో జ‌రిగిన దాడిలో భుజానికి గాయమయినందున వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వారు సూచించారు. వైద్యుల సూచనల మేరకు నవంబర్‌ 2వరకు ప్రజాసంకల్పయాత్రకు విరామం ప్రకటించడమైనది. తిరిగి నవంబర్‌ 3నుంచి విజయనగరం జిల్లాలో యధావిధిగా పాదయాత్ర కొనసాగుతుంది’’ అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news