జగ్గారెడ్డిని వాడుతున్న తమ్ముళ్ళు.. ప్లస్ చేసుకుంటారా?

-

ఏపీలో వైసీపీ-టీడీపీల మధ్య ఎలాంటి రాజకీయ యుద్ధం నడుస్తుందో చెప్పాల్సిన పని లేదు. రెండు పార్టీల మధ్య రాజకీయ శతృత్వం కాస్త..వ్యక్తిగత శత్రుత్వంగా మారిపోయింది. బద్ధ శత్రువులు మాదిరిగా రెండు పార్టీల నేతలు తిట్టుకుంటున్నారు. నెక్స్ట్ అధికారం దక్కించుకోవడం కోసం గట్టిగానే ఫైట్ చేస్తున్నారు. ఈ క్రమంలో అందివచ్చిన ఏ అవకాశాన్ని కూడా ఇరు పార్టీల నేతలు వదులుకోవడం లేదు.

ఇక అధికార వైసీపీకి చెక్ పెట్టడానికి టీడీపీ తనదైన శైలిలో ముందుకెళుతూనే ఉంది..ప్రతి అంశాన్ని ఒక అస్త్రంగా మలుచుకుని వైసీపీపై పోరాటం చేస్తుంది. ఇదే క్రమంలో తాజాగా తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి రూపంలో టీడీపీకి కొత్త అస్త్రం దొరికింది. సాధారణంగా టీడీపీ నేతలు..జగన్‌పై విమర్శలు చేస్తే పెద్దగా ఎఫెక్ట్ ఉండదు. ప్రజలు కూడా వాళ్ళు వాళ్ళు తిట్టుకుంటారులే అన్నట్లు ఉంటారు.

అలా కాకుండా వేరే పార్టీలకు చెందిన నాయకులు..ఇంకా చెప్పాలంటే పక్క రాష్ట్రాలకు చెందిన నాయకులు జగన్‌ని ఉద్దేశించి విమర్శించిన, అలాగే కేంద్రం ఏమన్నా జగన్‌కు యాంటీగా మాట్లాడినా సరే..వాటిని టీడీపీ వెంటనే ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమం చేసేస్తుంది. టీడీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తాయి. తాజాగా తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి..తాజాగా జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. వాస్తవానికి షర్మిల-జగ్గారెడ్డిల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

ఈ క్రమంలో జగ్గారెడ్డి..జగన్‌ని కూడా టార్గెట్ చేసి మాట్లాడారు. వైఎస్సార్ చనిపోయినప్పుడు ఏడవకుండా రాజకీయం చేశారని, అలాగే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మార్పు సరికాదని, మూడు రాజధానుల నిర్ణయం కరెక్ట్ కాదని, అవసరమైతే ఏపీని మూడు రాష్ట్రాలుగా విభజించుకుని ముగ్గురు సీఎంలుగా ఉండమని సెటైర్ వేశారు. ఇక ఎవరు జగన్‌పై విమర్శలు చేసిన..వాటిని టీడీపీ శ్రేణులు వైరల్ చేసేస్తాయి..టీడీపీ అనుకూల మీడియా హైలైట్ చేస్తుంది. ఇప్పుడు జగ్గారెడ్డి మాటలని తమ్ముళ్ళు బాగా వాడుకుని, జగన్‌ని టార్గెట్ చేస్తున్నారు. మరి జగ్గారెడ్డి మాటలు టీడీపీకి ఏ మాత్రం ప్లస్ అవుతాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news