పవన్ కళ్యాణ్‌పైనే కేసు పెట్టిన జనసేన నేత..

-

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ కు ఆ పార్టీ నేతలే వరుస షాకులు ఇస్తున్నారు. ఒకపక్క జనసేన పార్టీని బలోపేతం చేయాలని భావిస్తుంటే మరొక పార్టీ నేతలు ఒక్కొక్కరుగా ప‌వ‌న్‌కు షాక్ ఇస్తున్నారు. తాజాగా జనసేన నేత పవన్ కల్యాణ్‌పై కేసు నమోదు చేశారు. కుల, మతాల్ని రెచ్చగొట్టేలా పవన్ మాట్లాడుతున్నారనంటూ జనసేన నాయకుడు అలివర్ రాయ్ అన్నారు. పున్నమిఘాట్‌లో మత మార్పిడిలు జరుగుతు న్నాయంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు మతాల మధ్య చిచ్చుపెట్టేలా ఉన్నాయన్నారు.

పవన్ కళ్యాణ్ దిగజారి మాట్లాడుతున్నారని, తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేసిన కూడా పవన్‌లో ఎలాంటి స్పందన రాలేదన్నారు. పవన్‌లో ఎటువంటి పశ్చాత్తాపం కనిపింయకపోవడం వల్లనే కేసు పెట్టానని అలివర్ రాయ్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news