అన్నీ నాదెండ్ల చూసుకుంటారు: చెప్పేసిన పవన్

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి ఎన్నికల ప్రచారం విషయంలో ఆసక్తి చూపించకపోవడం తో జనసేన పార్టీ నేతలు కూడా పెద్దగా పట్టించుకునే ప్రయత్నం చేయటం లేదు. అయితే తిరుపతి ఉప ఎన్నికల విషయంలో పవన్ కళ్యాణ్ ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉండవచ్చు. జనసేన పార్టీలో ఉన్న కొంత మంది దగ్గరి నేతలకు తిరుపతి ఉప ఎన్నికల ప్రచార బాధ్యతలను పవన్ కళ్యాణ్ అప్పగించే ఆలోచనలో ఉన్నారని సమాచారం.

ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ గా ఉన్న నాదెండ్ల మనోహర్ కు తిరుపతి ఉప ఎన్నికల బాధ్యతలను అప్పగించే అవకాశాలు ఉండవచ్చని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక స్పష్టత కూడా పవన్ కళ్యాణ్… నాదెండ్ల మనోహర్ కు ఇచ్చారట. మనోహర్ తిరుపతిలో ఉన్న కార్యకర్తలతో సమావేశం కావాలని నియోజకవర్గాల వారీగా వరుసగా సమావేశాలు నిర్వహించి… కార్యకర్తలను ప్రచారంలోకి పంపించాలి అని పవన్ కళ్యాణ్ సూచించారు.

కొన్ని వ్యక్తిగత కారణాల వలన తాను రాలేకపోతున్నాను కాబట్టి నాదెండ్ల మనోహర్ ప్రచార బాధ్యతలను చూసుకుంటారని జనసేన పార్టీ నేతలకు పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి చెప్పినట్లుగా సమాచారం. జనసేన పార్టీ తరఫున త్వరలోనే నాదెండ్ల మనోహర్ ప్రచారం కూడా మొదలు పెట్టే అవకాశం ఉంది. ఇక బీజేపీ నేతలు కూడా పవన్ కళ్యాణ్ చేసే ప్రచారం పై చాలా ఆశలు పెట్టుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ దూరంగా ఉండటంతో నాదెండ్ల మనోహర్ తో కలిసి బీజేపీ నేతలు తిరుపతిలో ప్రచారం చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news