ఏపీ సీఎం జ‌గ‌న్‌తో జ‌న‌సేన ఎమ్మెల్యే భేటీ?

-

మంత్రివర్గ విస్తరణలో జగన్.. సామాజిక న్యాయం పాటించారంటూ కొనియాడారు. జగన్.. తాను ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటే ఖచ్చితంగా తమ పూర్తి సహకారం ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.

ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను జనసేన నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు కలిశారు. ఇవాళ శాసనసభ తొలి రోజు సమావేశాలు ప్రారంభం అయిన సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో సీఎం జగన్‌ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా జగన్‌కు ఆయన అభినందనలు తెలిపారు. అనంతరం జగన్‌తో కాసేపు ముచ్చటించారు.

జగన్‌తో మాట్లాడిన అనంతరం మీడియాతో మాట్లాడిన వరప్రసాద్ రావు.. మంత్రివర్గ విస్తరణలో జగన్.. సామాజిక న్యాయం పాటించారంటూ కొనియాడారు. జగన్.. తాను ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటే ఖచ్చితంగా తమ పూర్తి సహకారం ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.

జనసేన పార్టీ తరుపున రాజోలు నియోజకవర్గం నుంచి వరప్రసాద్ గెలిచారు. జనసేనకు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే ఆయనొక్కరే. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ఈ ఒక్క సీటును మాత్రమే గెలుచుకున్నది. చివరకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పోటీ చేసిన బీమవరం, గాజువాక స్థానాల్లోనూ జనసేన ఓడిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news