జగన్‌పై `నాడు అలా.. నేడు ఇలా` అంటూ జనసేన ఆసక్తికర ట్విట్‌

-

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి, వైఎస్ఆర్‌సీపీ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై జనసేన ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. ఈ నేప‌థ్యంలోనే జ‌న‌సేన పార్టీ ట్విట్ట‌ర్ ఖాతాలో ఓ ట్విట్ కూడా చేశారు. వివ‌రాల్లోకి వెళ్తే.. ‘మాట తప్పడం-మడమ తిప్పడం జగన్ రెడ్డి నైజం’ అంటూ జనసేన పార్టీ విరుచుకుపడింది. నాడు ఆంధ్రప్రదేశ్‌లో జగన్ వ్యవహరించిన తీరు, నేడు వ్యవహరిస్తోన్న తీరును గుర్తు చేస్తూ తమ అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో ఓ పోస్టు చేసింది. నాడు రేట్లు పెరిగాయని జగన్ బాధ నటించాడని జనసేన పేర్కొంది.

నేడు ప్రజలపై స్వయంగా భారం వేశాడని వివరిస్తూ పలు అంశాలను ప్రస్తావించింది. మళ్లీ చంద్రబాబు నాయుడికి ఓటు వేస్తే విద్యుత్తు, ఆర్టీసీ టిక్కెట్లు, పెట్రోల్ ధరలు, ఇంటి పన్నులు పెంచేస్తాడు అని ఎన్నికల ముందు జగన్ చెప్పిన మాటలను జనసేన పోస్ట్ చేసింది. ఇప్పుడు జగన్ పెంచేసిన ధరలను ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించింది. పెట్రోపై వ్యాట్ పెరిగిన న్యూస్‌ను పోస్ట్ చేసింది జ‌న‌సేన‌.

Read more RELATED
Recommended to you

Latest news