విజయవాడ: పాత బండికి కొత్త డ్రైవర్ వచ్చినట్లుగా..లోక్సత్తా పార్టీకి కొత్త అధ్యక్షుడిగా జేడీ లక్ష్మీనారాయణ వచ్చారని వైఎస్సార్సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. నీతి, నియమాల గురించి మాట్లాడే లోక్సత్తా నాయకులు.. ఈ నాలున్నరేళ్ల చంద్రబాబు అవినీతిపై, కాల్మనీ, సెక్స్రాకెట్ తదిరత అంశాలపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. చంద్రబాబు కోసం పుట్టిన కవలల్లో ఒకటి లోక్సత్తా పార్టీ కాగా, మరొకటి జనసేత పార్టీ అని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకే చంద్రబాబు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో గోదావరి-పెన్నా నదుల అనుసంధానం పేరుతో చంద్రబాబు డ్రామాలాడుతున్నారని విమర్శించారు. ఎన్నికలు అనేసరికే చంద్రబాబుకు అన్ని పథకాలు గుర్తుకు వస్తాయని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పట్టిసీమ నుంచి రాయలసీమ వరకూ అణువణువు దోచుకున్నారని ఆరోపించారు.
జేపీ, జేడీలిద్దరూ చంద్రన్న కవలలు: అంబటి
By Anil Kumar
-
Read more RELATEDRecommended to you
డీసీఎం బోల్తా పడి గాయాలైన బాధితులను పరామర్శించిన బాజిరెడ్డి గోవర్ధన్..!
నిజామాబాద్ జిల్లా వర్ని మండలం బడా పహాడ్ దగ్గర ఘోర రోడ్డు...
పొన్నం: గతంలో ఆలయాలు లేవా..? బండి సంజయ్ గ్రామాల్లోకి వచ్చారా..?
కాంగ్రెస్ వచ్చిందంటే హనుమాన్ చాలీసా చదవనికోమని అంటున్నారు. మన ఆస్తులు ముస్లింలకు...
హరీష్ తెలివి అరికాళ్ళల్లోకి జారిపోయినట్టుంది.. రేవంత్ రెడ్డి సెటైర్..!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఈరోజు హైదరాబాద్లోని...