బెంగాల్ ఎన్నికలపై మోడీ-షా ఫోకస్‌…నవరాత్రి ఉత్సవాలే లక్ష్యంగా బీజేపీ ప్లాన్‌..!

-

పశ్చిమ బెంగాల్ పై ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి ప్రత్యేక దృష్టి పెట్టారు..వచ్చే ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగతుండటంతో ఇప్పుడు బీజేపీ పెద్దల దృష్టి బెంగాల్‌పై పడింది..మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న చాలా నిర్ణయాలపై విమర్శిస్తున్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వాన్నిఎన్నికల్లో ఓడించడానికి జేపీ నడ్డా కొత్త టీం ఫొకస్‌ పెట్టింది..అందుకు అనుగుణంగానే మోదీ-అమిత్ షా ద్వయం ప్రణాళికలు రచిస్తున్నారు..అందులో బాగంగా ఈ ఏడాది నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బెంగాల్లో జరిగే దుర్గా పూజ ఉత్సవానికి వర్చువల్‌గా ప్రధాని మోడీ హాజరుకానున్నారు. అక్టోబర్ 22 న వర్చువల్ ర్యాలీలో మోడీ ప్రసంగించనున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో షష్టి తిథి రోజున ప్రధాని దుర్గా ఉత్సవాల్లో పాల్గొంటారు.
పండుగ సీజన్ కోసం పశ్చిమ బెంగాల్ సన్నద్ధమవుతున్న తరుణంలో తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) మరియు భారతీయ జనతా పార్టీ (బిజెపి) రెండూ 2021 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని ఒకరినొకరు అధిగమించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు..ఇప్పటికే రాష్ట్ర బిజెపి ‘నబన్నా చలో అభిజన్’ తో పేరుతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్‌ను పెంచింది, ఇప్పుడు దానిని ముందుకు తీసుకెళ్లడానికి వారు అక్టోబర్ 22న ‘శాస్తి’ సందర్భంగా దుర్గా పూజ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించాలని రాష్ట్ర బీజేపీ నేతలు ప్రధాని నరేంద్రమోదీని అభ్యర్థించింది.
మరోవైపు ప్రధాని వర్చువల్ భేటీకు ముందే ఉత్తర బెంగాల్‌లో కేంద్ర మంత్రి అమిత్ షా ఉత్తర మరియు దక్షిణ బెంగాల్‌లో జరిగే పార్టీ ముఖ్య నేతల సమావేశాలకు హాజరవుతారు..బహిరంగ సభలు నిర్వహించి బూత్ స్థాయిలో కార్యక్తలను ఎన్నికలకు సంసిద్దత చేయాలని బీజేపీ నిర్ణయించింది..ఈ సభల ద్వారా పార్టీ ముఖ్యనేతలు,కార్యకర్తలతో పార్టీ స్థానిక పరిస్థితులను తెలుసుకుంటారు..తద్వార టిఎంసిని ఎన్నికల్లో ఓడించడానికి రోడ్‌మ్యాప్పై పార్టీ నాయకులకు అమిత్‌ షా వివరించనున్నారు..రాష్ట్ర-కేంద్రీకృత సమస్యలపై షా ఈ సందర్భంగా చర్చించనున్నారు, ఇది రాష్ట్రంలో టిఎంసికి వ్యతిరేకంగా బిజెపి షెడ్యూల్ చేసిన ప్రచారంలో హైలైట్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news