వైసీపీ ఎంపీ చేసిన కామెడీకి ఫిదా అయిన నారా లోకేష్‌.. అస‌లు క‌థ ఏంటంటే..?

-

వైసీపీ ఎంపీలపై ట్విట్టర్‌ వేదికగా టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్‌ సెటైర్లు వేశారు. చంద్రబాబు హయాంలో ఫ్రాంక్లిన్ టెంపుల్ టౌన్ అనే డమ్మీ కంపెనీని ఏర్పాటు చేశారంటూ లోక్ సభలో నిన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీంతో `అది ఫ్రాంక్లిన్ టెంపుల్ టౌనో, విలేజో కాదు మాస్టారు. ఆ కంపెనీ పేరు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్. కంపెనీ పేరు కూడా తెలుసుకోకుండా ‘ఫ్రాంక్లిన్ టెంపుల్ టౌన్ చంద్రబాబుగారి బినామీ కంపెనీ’ అంటూ పార్లమెంటులో వైకాపా ఎంపీ చేసిన స్టాండ్ అప్ కామెడీ నన్ను ఫిదా చేసింది.

ఫ్రాంక్లిన్ చంద్రబాబుగారి బినామీ కంపెనీ కదా… అలాంటి ఆ కంపెనీలో మీరెందుకు పెట్టుబడులు పెట్టారని జగన్ గారిని నిలదీయండి ఫ్రాంక్లిన్ టెంపుల్ టౌన్ ఎంపీ గారు. ఒక అంతర్జాతీయ సంస్థ ఉత్తరాంధ్రకి రావడం జగన్ గారికి మొదటి నుండీ ఇష్టం లేదు. ఉత్తరాంధ్ర యువతకి మంచి కంపెనీలో ఉద్యోగాలు రావడం వైసీపీ నాయకులకు రుచించడం లేదు. ఎప్పటికీ ఉత్తరాంధ్ర వెనుకబడి ఉండాలి అనే దురుద్దేశంతో కంపెనీలు రాకుండా అడ్డుపడుతున్నారు. బినామీ కంపెనీలు అంటూ చెత్త మాటలు మాట్లాడుతున్నారు కాబట్టే కంపెనీలు జగన్ గారిని చూసి బైబై ఏపీ అంటున్నాయి’ అని లోకేశ్ ట్విట్ట‌ర్ అకౌంట‌ర్ విమ‌ర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news