మీ కడుపు మంటకూ మందు లేదు.. సీఎం జ‌గ‌న్‌పై లోకేష్ సెటైర్లు..!

-

నిన్న క‌ర్నూల్ ప‌ర్య‌ట‌న చేసిన సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చంద్ర‌బాబుపై ఆస‌క్తిక వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. క‌ర్నూల్‌లో వైయస్సార్‌ కంటి వెలుగు మూడవ దశను ప్రారంభించిన సీఎం వైయస్.. ఆరోగ్యశ్రీలో 2వేల వ్యాధులకు పైగా చికిత్స చేస్తున్నామని…ఇంకా క్యాన్సర్‌కు కూడా ఆరోగ్యశ్రీలో ఉచిత వైద్యం ఉందని అన్నారు. కానీ, అసూయతో కూడిన కడుపు మంటకు ఎక్కడా చికిత్స లేదని చంద్ర‌బాబుపై ప‌రోక్షంగా వ్యాఖ్యానించారు. ప్రజల కోసం నేను నిజాయితీగా ఎన్ని మంచి పనులు చేసినా చంద్రబాబుకు విమర్శించడం తప్ప మరో పనిలేదని జగన్ మండిప‌డ్డారు.

అయితే `నా పనితీరు చూసి ఈర్ష్యతో రగిలిపోతున్న విపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు కడుపు మంటకు మందు లేదు’ అన్న ఏపీ సీఎం వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యలకు మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ దీటైన సమాధానం ఇచ్చారు. ‘నవ్యాంధ్రను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఐదేళ్లపాటు చంద్రబాబు ప్రారంభించిన పలు ప్రాజెక్టులు పూర్తికాకూడదన్న ధోరణితో పనిచేస్తున్న మీ కడుపు మంటకూ మందు లేదు’ అంటూ ట్విట్టర్‌ వేదికగా కౌంటర్‌ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news