ఎంపీ టికెట్ కోసం.. 60 కోట్లు రెడీగా పెట్టుకోమన్న చంద్రబాబు

-

ఇది చంద్రబాబు అసలు రూపం. టీడీపీలో ఎంత స్థాయిలో అవినీతి జరుగుతోందో.. ఏ స్థాయిలో అక్రమాలు జరుగుతున్నాయో తెలిపేందుకు చక్కని ఉదాహరణ. ఫిరాయింపు ఎంపీ ఎస్పీవై రెడ్డికే ఈ అనుభవం ఎదురైంది. 2014లో వైసీపీ నుంచి నంద్యాల ఎంపీగా గెలిచిన ఈయన తర్వాత టీడీపీలోకి మారారు. అయితే.. ఈసారి ఆయనకు టీడీపీ నుంచి నంద్యాల ఎంపీ టికెట్ రావడం కష్టమేనట. దీంతో ఎందుకు వచ్చిన లొల్లి అని ముందే చంద్రబాబు దగ్గరికి వెళ్లి తన ఎంపీ టికెట్ గురించి మాట్లాడారట.

దీంతో.. చంద్రబాబు చెప్పినది విని షాకవడం రెడ్డి వంతయిందట. టికెట్ కావాలంటే 60 కోట్ల రూపాయలు రెడీగా పెట్టుకోమన్నారట చంద్రబాబు. దానికి సంబంధించిన బ్యాంక్ డిపాజిట్ పత్రాలను చూపించాలని చంద్రబాబు రెడ్డితో అన్నారట. ఎంపీ టికెట్ కావాలంటే.. ఆమాత్రం ఖర్చవుతుందని అన్నారట.

ఇప్పటికే తాను అప్పుల్లో ఉన్నానని.. అలాంటిది అరవై కోట్ల రూపాయలు అంటే ఎక్కడి నుంచి తీసుకురావాలని ఆయన తన అనుచరుల ముందు వాపోయారట. ఒకవేళ ఎస్పీవై రెడ్డి 60 కోట్లు ఇచ్చే సూచనలు లేకపోతే చంద్రబాబు భూమా అఖిల ప్రియను బరిలోకి దించనున్నట్టు సమాచారం. కాకపోతే ఆమె కూడా 60 కోట్ల రూపాయలు పెట్టుకోవడానికి ససేమిరా అన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news