వైసీపీ ప్రభుత్వాన్ని కూలుస్తా; పవన్ సంచలన వ్యాఖ్యలు…!

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. తన వద్దకు వచ్చిన మహిళలు, రైతులతో ఆయన జనసేన పార్టీ కార్యాలయంలో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వారిపై జరిగిన దాడి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. జగన్ ప్రభుత్వాన్ని కూల్చే వరకు తాను నిద్రపోయేది లేదని స్పష్టం చేసారు.

ఆడపడుచులు కన్నీళ్లు పెట్టారని వైసీపీ వినాశనం మొదలై౦దన్న ఆయన ఫ్యాక్షన్ తరహా పాలన చెయ్యాలని వైసీపీ చూస్తుందని అన్నారు. ఇక ఏపీలో వైసీపీకి అధికారం అనేది ఉండదు అని ఆయన వ్యాఖ్యానించారు. దివ్యా౦గులు అని కూడా చూడకుండా దాడి చేసారని ఆవేదన వ్యక్తం చేసారు. అమరావతి ఇక్కడి నుంచి కదలదని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. వైసీపీ వాళ్ళ భూములు ఇక్కడ ఉంటే,

అమరావతి ఇక్కడి నుంచి కదిలేదా అని, విశాఖలో భూములు ఉన్నాయి కాబట్టే అక్కడికి రాజధాని వెళ్తుందని ఆయన అన్నారు. వైసీపీ పతనం మొదలైందని అన్నారు. అమరావతిలో శాశ్వత రాజధాని ఉండాలని అన్నారు. ఇదిలా పవన్ కళ్యాణ్ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. బీజేపీ, జనసేన పొత్తు కుదిరిన నేపథ్యంలో… ఇరు పార్టీల సమన్వయం సమావేశం రేపు ఢిల్లీలో జరగనుంది.

అమరావతిపై ఏ రకంగా ఉద్యమించాలనే దానిపై ఇరు పార్టీలు కలిసి కార్యాచారణ రూపొందించనున్నాయి. ఇప్పటికే బిజెపి కూడా అమరావతిలోనే రాజధాని ఉండాలని ఏకగ్రీవ తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఢిల్లీ పర్యటన నేపధ్యంలో రేపు ఎం చర్చిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అటు వైసీపీలో కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది.

Read more RELATED
Recommended to you

Latest news