గంటాపై ప‌వ‌న్ తిట్లు పైకి మాత్ర‌మే… లోపల ఎంత ప్రేమంటే..!

-

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావుతో పాటు వైసీపీకి చెందిన మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు లాంటి వాళ్ల‌ను పైకి తీవ్రంగా విమ‌ర్శ‌లు చేస్తూ ఉంటారు. వాళ్ల‌కు ప్ర‌జ‌రాజ్యంలో తమ కుటుంబంమే లైఫ్ ఇచ్చింద‌ని… ఇలా ఏదేదో మాట్లాడుతూ ఉంటుంటాడు. ఇక గంటా మెగా కుటుంబానికి అత్యంత స‌న్నిహితుడు అన్న విష‌యం ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

అందుకే ఇటీవ‌ల టీడీపీ ఓడిపోయాక గంటా చిరుతో రాసుకుని పూసుకుని తిరుగుతూ చిరు డైరెక్ష‌న్‌లోనే ముందుకు న‌డుస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఇక ప‌వ‌న్ సైతం గంటాపై పైకి మాత్రం వీలున్న‌ప్పుడ‌ల్లా విమ‌ర్శ‌లు చేస్తూనే ఉంటాడు. అయితే అదంతా పైకి ఇత‌ర పార్టీల క‌న్నీళ్లు తుడ‌వ‌డానికి, జ‌నాల‌కు అనుమానాలు రాకుండా ఉండేందుకు మాత్ర‌మే అని తెలుస్తోంది.

తాజాగా ప‌వ‌న్ గంటా తోడ‌ళ్లుడు అయిన ప‌రుచూరి భాస్క‌ర‌రావుకు జ‌న‌సేన అధికార ప్ర‌తినిధి ప‌ద‌వి ఇచ్చారు. ఒంగోలు నుంచి విశాఖకు వ్యాపారం కోసం వచ్చిన పరుచూరి భాస్కరరావు గంటా శ్రీనివాసరావు చుట్టంగా ఒక వెలుగు వెలిగారు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు భీమిలి టీడీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న ప‌రుచూరి ఎన్నిక‌ల‌కు ముందు జ‌న‌సేన‌లో చేరారు. ప‌వ‌న్ ఆయ‌న‌కు అన‌కాప‌ల్లి సీటు ఇవ్వగా ఓడిపోయారు.

ఇక ఆయ‌న తాజాగా పవన్ లాంగ్ మార్చ్ కి జనాలకు తరలింపుతో పాటు, అవసర‌మైన నిధులను కూడా ఖర్చు చేశారని ప్రచారంలో ఉంది. ఇక ఆయ‌న‌కు అధికార ప్ర‌తినిధి ప‌ద‌వి ఇవ్వ‌డం వెన‌క త‌న‌కు అవ‌స‌రం ఉన్న‌ప్పుడు గంటా తెర‌వెన‌క స‌హ‌క‌రిస్తార‌న్న ప్లానే అన్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇక య‌ల‌మంచిలిలో జనసేన అభ్యర్ధి అయిన సుందరపు విజయకుమార్ కి కూడా అధికార ప్రతినిధి పదవిని ఇచ్చారు.

ఏదేమైనా గంటా వియ్యంకుడికి జ‌న‌సేన‌లో కీల‌క బాధ్య‌త‌లు ఇవ్వ‌డం ద్వారా ప‌వ‌న్ గంటాపై ప‌రోక్షంగా అయిన త‌న ప్రేమ‌ను చాటుకున్న‌ట్టే ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ఇక వైసీపీ వాళ్లు ఇప్ప‌టికే ప‌వ‌న్ బాబు ద‌త్త‌పుత్రుడు అని విమ‌ర్శ‌లు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news