మోడీ రాయ‌ల‌సీమ ఫ్యాక్ష‌నిస్టును త‌ల‌పిస్తున్నారు: ఎంపీ జేసీ

-

అమ‌రావ‌తి: ప్ర‌ధాని మోడీ రాయ‌ల‌సీమ ఫ్యాక్ష‌నిస్టును త‌ల‌పిస్తున్నార‌ని, త‌న‌కు గిట్ట‌నివారిని ఇబ్బంది పెట్టేందుకు మోడీ- అమిత్‌షాలు ఎంత‌కైనా దిగ‌జారుతార‌ని అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్‌రెడ్డి అన్నారు. కేశినేని నాని కార్యాల‌యంలో ఎంపీల విందుకు హాజ‌రైన జేసీ మోడీ పాల‌న‌లో ఏపీ ప్రభుత్వం పాము ప‌డ‌గ నీడ‌లో బ‌తికినట్లు ఉంద‌న్నారు. ‘నేను బతకాలి.. ఇంకెవరూ బతకకూడదు’ అనేది ప్రధాని మోదీ భావజాలమని, తనతో పాటు పది మంది బతకాలనే మనస్తత్వం సీఎం చంద్రబాబుదని దివాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక ఎన్నికల ప్రచార సభల్లో ఏపీ సీఎం చంద్రబాబుపై కేసీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై జేసీ కేసీఆర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడుతున్న భాషతో కేసీఆర్ తన నెత్తిన తానే చేయి పెట్టుకుంటున్నారని అన్నారు. కేసీఆర్ భాష మార్చుకోవాలని… దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు ఎలా మాట్లాడుతారో చూడాలని సూచించారు. స్వామి ప్రబోధానంద ఒక క్రిమినల్ అని అతని గురించి మాట్లాడటం వేస్ట్ అని ఎంపీ జేసీ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news