ఏపీలో మరో వివాదం: అమరావతి రైతులకు బేడీలు

-

ఆంధ్రప్రదేశ్ పోలీసుల తీరుపై మరోసారి విమర్శలు వస్తున్నాయి. తాజాగా అమరావతి రైతులకు పోలీసులు బేడీలు వేసారు. గుంటూరు జిల్లా జైలుకు రాజధాని రైతులను తరలించారు. రైతులకు బేడీలు వేసి పోలీసులు తీసుకువెళ్ళారు. జైలు వద్ద రైతులను పరామర్శించిన మాజీ మంత్రి ఆలపాటి రాజా , టిడిపి నేతలు పిల్లి మాణిక్యరావు, కోవెలమూడి రవీంద్ర… అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

రాజధాని పరిరక్షణ సమితి కన్వినర్ సుధాకర్ వారితో ఉన్నారు. రైతులకు బేడీలు వేయడం పై ఆగ్రహం వ్యక్తం చేసారు. మంగళగిరి మండలం కృష్టాయపాలెం కు చెందిన రైతులు ఎస్సీ , ఎస్టీ ఆట్రాసిటీ కేసులు నమోదు చేసారు. జిల్లా జైలుకు ఆరుగురు రైతులు తరలించారు. నరసరావుపేట సబ్ జైలులో పలువురు రైతులు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news