100 రోజులు పూర్తి చేసుకున్న రాహుల్ ‘భారత్ జోడో యాత్ర’

-

యావత్ దేశాన్ని ఒకే తాటిపై తీసుకురావాలన్న ఉద్దేశంతో.. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తేవాలన్న లక్ష్యంతో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఎన్ని ఆటంకాలు ఎదురైనా.. ఎంతగా అలసిపోయినా.. రాహుల్ ఈ యాత్రను కొనసాగిస్తూనే ఉన్నారు. భారత్ జోడో యాత్ర 100 రోజులు పూర్తి చేసుకుంది. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు 3,500 కిలోమీటర్ల దూరం సాగుతోన్న ఈ యాత్రకు అన్నివర్గాల నుంచి ఆదరణ లభిస్తోందని హస్తం పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

సెప్టెంబర్‌ 7న కన్యాకుమారి నుంచి ప్రారంభమైన భారత్‌ జోడో యాత్ర ఇప్పటివరకూ 8 రాష్ట్రాల గుండా సాగింది. తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో యాత్ర పూర్తికాగా ప్రస్తుతం రాజస్థాన్‌లో సాగుతోంది. ఇప్పటివరకు 2800 కిలో మీటర్లు పూర్తి చేసుకున్న ఈ యాత్ర ద్వారా రాహుల్‌ తన మద్దతుదారులతోపాటు వ్యతిరేకులను కూడా ఆకట్టుకున్నారు. భారత్‌ జోడో యాత్రలో వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు పాల్గొని మద్దతు ప్రకటించారు.

బుల్లితెర, వెండితెర నటీనటులతోపాటు వివిధ రంగాల ప్రముఖులు కూడా పాల్గొన్నారు. బాలీవుడ్‌కు చెందిన రియాసేన్‌, పూజాభట్‌, సుశాంత్‌సింగ్‌, స్వరభాస్కర్‌, రేష్మీ దేశాయ్‌, ఆకాంక్ష పూరీ, అమోల్‌ పాలేకర్‌ తదితర ప్రముఖులు రాహుల్‌తో కలిసి పాదయాత్ర చేశారు. నౌకాదళం చీఫ్‌ విశ్రాంత అడ్మిరల్‌ రామదాస్‌, ప్రతిపక్ష నేతలు ఆదిత్య ఠాక్రే, సుప్రియా సూలే,ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌సహా రచయితలు, విశ్రాంత మిలిటరీ అధికారులు, ఇతర రంగాల ప్రముఖులు కూడా భారత్‌ జోడో యాత్రలో పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news