బ్రేకింగ్;రాజ్యసభ సీట్లను ఖరారు చేసిన జగన్…!

-

ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ ఎన్నికల నేపధ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజ్యసభ సీట్లను ఖరారు చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ముగ్గురుని రాజ్యసభకు పంపించడానికి జగన్ రెడీ అయ్యారు. 2014 లో ఎంపీగా పోటీ చేసిన అయోధ్య రామిరెడ్డి పేరుని జగన్ ఖరారు చేసారు. అదే విధంగా అంబాని తో పాటు తాడేపల్లి వచ్చిన రాజ్యసభ ఎంపీ పరిమల్ నత్వానికి రాజ్యసభ సీటు ఖరారు చేసారు జగన్.

బీసీలకు పెద్ద పీట వేసే ఆలోచనలో ఉన్న ఆయన మోపిదేవి వెంకటరమణను రాజ్యసభకు పంపడానికి సిద్దమయ్యారు. అలాగే మైనార్టీల నుంచి ఒకరిని ఎంపిక చెయ్యాల్సి ఉంది. నత్వాని ని పక్కన పెడితే మూడు స్థానాలను జగన్ వైసీపీ కీలక నేతలకు ఖరారు చేసారు. రెండు మూడు రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఏప్రిల్ 4 న రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి.

పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ కేంద్ర మంత్రి కిల్లి క్రుపారాణి పేర్లు కూడా పరిశీలనుకు వస్తున్నాయి. మరి మహిళలకు జగన్ అవకాశం కల్పిస్తారో లేదో అనేది చూడాల్సి ఉంది. ముఖ్యంగా వైఎస్ షర్మిల పేరు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. మరి ఎవరిని జగన్ ఖరారు చేస్తారో స్పష్టత రావాల్సి ఉంది. ఈ నెలలో తెలంగాణాలో కూడా రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్న సంగతి తెలిసిందే. చూడాలి మరి ఏమవుతుందో.

Read more RELATED
Recommended to you

Latest news