ఏపీ ప్రభుత్వానికి నిమ్మగడ్డ మరో లేఖ, ఏకంగా ఆదేశాలు…!

-

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీకి ఎస్ ఈ సీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాసారు. కలెక్టర్లు,జడ్పీ సీఈవోలు,జిల్లా పంచాయతీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు కోసం ఆయన లేఖ రాసారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై చర్చించేందుకు సమావేశమవ్వాలని నిర్ణయించినట్లు ఆయన లేఖలో పేర్కొన్నారు. ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ లో అధికారులు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ కు ఎస్ఈసీ ఆదేశాలు ఇచ్చారు.

వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనేందుకు ఇప్పటి వరకు కలెక్టర్లు,ఉన్నతాధికారులకు అనుమతి రాలేదు. ఎస్ ఈసీ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కలెక్టర్లకు అనుమతి ఇవ్వకపోవడంతో నిన్న వీడియో కాన్ఫరెన్స్ సమావేశం రద్దు చేసారు. ఇవాల్టి వీడియో కాన్ఫరెన్స్ సమావేశంపై సందిగ్ధత కొనసాగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news