రేవంత్ ని సైలెంట్ గా దెబ్బ కొట్టిన షర్మిల…?

-

తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు కొంత మంది అగ్ర నేతలు బయటకు వెళ్లవచ్చు అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా ఉంది. అయితే తెలంగాణ కాంగ్రెస్ లో ఉన్న చిన్నచిన్న నేతలు కూడా ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ వైపు లేకపోతే భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇక ఇప్పుడు షర్మిల విషయంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చాలా ఇబ్బందులు పడుతుంది.

ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీ లేదా టిఆర్ఎస్ పార్టీ వైపు చూసిన చాలా మంది నేతలు ఇప్పుడు షర్మిల పార్టీ వైపు చూస్తున్నారని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతే కాకుండా షర్మిలతో సమావేశాలు కూడా రహస్యంగా నిర్వహిస్తున్నారని ఇప్పటికే ఆమెతో ఫోన్లో కూడా కొంతమంది నేతలు మాట్లాడారు అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి తో అత్యంత సన్నిహితంగా ఉండే రంగారెడ్డి జిల్లాకు చెందిన ఇద్దరు కీలక నేతలు వై ఎస్ షర్మిల తో రహస్యంగా సమావేశం కూడా నిర్వహించారని సమాచారం.

దీనితో రేవంత్ రెడ్డి కూడా అలెర్ట్ అవుతున్నారని తెలుస్తోంది. రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడితే టిఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ వ్యతిరేక వర్గాలు అన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి సహకరించే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు అదే జరిగితే ఆ రెండు పార్టీలకు తీవ్రంగా నష్టం జరుగుతుంది. కాబట్టి షర్మిల కూడా కాస్త కాంగ్రెస్ పార్టీ బలోపేతం కాకుండా సహకరిస్తున్నారు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరి ఎంత మంది నేతలు షర్మిలతో సమావేశాలు నిర్వహిస్తారు ఏంటి అనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news