సభ్య సమాజానికి సోనియాగాంధీ కొత్త మెసేజ్.!

-

ఢిల్లీలో తీవ్రస్థాయిలో వాయు కాలుష్యం పెరిగి పోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతం సోనియాగాంధీ గోవా లో ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుచుకునేందుకు వివిధ రకాల వ్యాయామాలు చేస్తున్నారు సోనియాగాంధీ. ఇక ఇటీవల ఆమె వ్యాయామాలతో పాటు సైక్లింగ్ కూడా చేస్తున్నారు. ఇటీవలే గోవాలో ఓ స్టార్ హోటల్ ఆవరణలో సోనియా గాంధీ సైకిల్ తొక్కుతూ కనిపించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

గత కొన్నేళ్ల నుంచి ఛాతి ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రస్తుతం వైద్యపర్యవేక్షణలో గోవాలో ఉంటున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో ప్రస్తుతం వాయు కాలుష్యం అంతకంతకూ ఎక్కువవుతు కనీసం ఊపిరి పీల్చుకోవడానికి తగిన నాణ్యమైన గాలి కూడా లేకపోయినా నేపథ్యంలో మరింత ఆరోగ్యం విషమించే అవకాశం ఉంది అని భావించిన సోనియా గాంధీ గోవాలో ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. అదే సమయంలో సైక్లింగ్ చేయడం ద్వారా పర్యావరణాన్ని కాపాడాలని ఎంతమందికి మెసేజ్ ఇస్తున్నారు సోనియా గాంధీ.

Read more RELATED
Recommended to you

Latest news