ఆ పని బాబు గారు చేస్తే వదిలేస్తారా సాయి గారూ…!

-

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిని ఉద్దేశించి టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేసారు. “43 వేల కోట్ల ప్రజాధనం లూటీ చేసి,16 నెలలు చిప్పకూడు తిన్న జగన్ రెడ్డి గారిని విజన్ ఉన్న నాయకుడు అంటారా సాయిరెడ్డి?పోలవరం యాత్రకు ధనం వృధా చేసి ఉంటే మీ సైకో బ్యాచ్ ఊరుకుంటుందా?పోలవరం అనేది 7 దశాబ్దాల రాష్ట్ర ప్రజల కల.70 శాతం చంద్రబాబు గారు పూర్తి చేసారు కాబట్టి, కల సాకారం అవుతున్న దృశ్యాన్ని ప్రజలకు చూపించారు.మీ లాగా ఢిల్లీ వాళ్లకు ‘ఫుట్ మసాజ్’ చేయకుండా, రాష్ట్ర సమస్యల పై కేంద్రంతో పోరాడారు.ఖర్చుల్లో తేడా ఉంటే,ఏమి పీక్కుంటావో పీక్కో.

స్కూల్ పిల్లలు వేసుకునే బెల్ట్ కి,సాక్స్ కి వైకాపా రంగులు వేసుకునే నువ్వు దుబారా గురించి మాట్లాడుతున్నావా?అన్నట్టు 4 వేల కోట్ల తో పంచాయతీలకు వైకాపా రంగుల దుబారా మర్చిపోయావా?తాడేపల్లి ఇంటి కోసం రూ.16 కోట్లు,నాయన సమాధి కోసం రూ.27 కోట్లు, చచ్చు సలహాలు ఇచ్చే సలహాదారులకు 60 కోట్లు,సిబిఐ కోర్టుకు వెళ్లడానికి ప్రతీ వారం 60 లక్షలు,మీ కక్షలు తీర్చుకోవటానికి లాయర్ల ఫీజులంటూ వందల కోట్లు,మీ అవినీతి పత్రికకు వందల కోట్లు,మీరు చేసే వేల కోట్ల దందాలు,మొత్తం లెక్క తీస్తే, 10 పోలవరం ప్రాజెక్ట్లు కట్టవచ్చు”అని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news