వచ్చే ఎన్నికల్లో మోదీ నిలబడే చోటు నుంచి కూడా బీఆర్ఎస్ పోటీ : మంత్రి శ్రీనివాస్ గౌడ్

-

జాతీయ పార్టీలు ఏ విధంగా అయితే దేశవ్యాప్తంగా పోటీ చేస్తాయో అదే మాదిరి భారత్ రాష్ట్ర సమితి కూడా ఎన్నికల బరిలోకి దిగుతుందని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఒక గుజరాత్ మాత్రమే కాదని.. మోదీ నిలబడే చోట కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఫస్ట్ టార్గెట్ మాత్రం కర్ణాటక అని.. ఆ తర్వాత మహారాష్ట్ర అని.. అనంతరం ఇతర రాష్ట్రాలపై ఫోకస్ పెడతామని తెలిపారు.

“తెలంగాణ ప్రజల మాదిరి దేశ ప్రజలు బతకాలన్నదే కేసీఆర్‌ ఆలోచన. తెలంగాణ ఇల్లు బాగుపడ్డది.. ఊరు బాగుపడ్డది.. పట్నం బాగుపడ్డది.. రాష్ట్రం బాగుపడ్డది.. ఇప్పుడు దేశం బాగుపడాలి. తెలంగాణలో ఏ విధంగా ప్రణాళికతో అభివృద్ధి జరిగిందో.. ఎలాంటి పథకాలు అమలవుతున్నాయో.. దేశవ్యాప్తంగా అవి అమలు కావాలన్నదే.. తెలంగాణలా భారతదేశం ఉండాలన్నదే సీఎం కేసీఆర్‌ లక్ష్యం. ఆయన లక్ష్యం, ఆలోచన గొప్పది.. నిజాయతీగా చేస్తున్నారు కాబట్టి.. ఆయన కోరిక కచ్చితంగా నెరవేరుతుందనే నమ్మకం ఉంది.”  – శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర మంత్రి

Read more RELATED
Recommended to you

Latest news