ఢిల్లీ కి చేరుకున్న తెలంగాణ‌ మంత్రుల బృందం

-

యాసంగి ధాన్యం కోనుగోలు విష‌యం పై మ‌రోసారి కేంద్ర ప్ర‌భుత్వం తో చ‌ర్చించ‌డానికి తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ఎంపీలు ఢిల్లీ కి చేరుకున్నారు. రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి తో పాటు మంత్రులు గంగుల క‌మలాక‌ర్, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, జగ‌దీశ్ రెడ్డి, పువ్వాడ అజేయ్ కుమార్, వేముల ప్ర‌శాంత్ రెడ్డి తో పాటు టీఆర్ఎస్ ఎంపీ లు ఢిల్లీ కి చేరుకున్నారు. యాసింగి ధాన్యం కొనుగోల్ల పై మ‌రోసారి కేంద్ర ప్ర‌భుత్వం పై ఒత్త‌డి తీసుకు రావ‌డానికి తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ఎంపీలు ఢిల్లీ కి చేరుకున్నారు.

అలాగే ప్ర‌స్తుతం వానా కాలం లో వ‌చ్చిన అదన‌పు ధాన్యం కొనుగోళ్ల పై కూడా కేంద్ర ప్ర‌భుత్వం తో మంత్రులు, ఎంపీలు చ‌ర్చించ నున్నారు. ఇప్ప‌టి కే ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ తో పాటు ప‌లువురు కేంద్ర మంత్రుల అపాయింట్ మెంట్ కోసం అధికారులు ఇప్ప‌టి కే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. రెండు రోజుల పాటు మంత్రులు, ఎంపీలు ఢిల్లీ లో నే ఉండే అవ‌కాశాలు ఉన్నాయి. రేపు, ఎల్లుండి ప్ర‌ధాని మోడీ, పీయూష్ గోయాల్ తో స‌మావేశం కావ‌డానికి మంత్రులు, ఎంపీ లు ప్ర‌య‌త్నిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news