నా హత్యకు కుట్ర జరిగింది: తెలంగాణా మంత్రి కీలక వ్యాఖ్యలు

-

నిన్న తనపై జరిగిన దాడికి సంబంధించి తెలంగాణా రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేసారు. బిజెపి కార్యకర్తలు తనను చంపడానికి కుట్ర చేసారు అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేసారు. బాచుపల్లి లో నా మెడికల్ కళాశాల కు వెళ్తుండగా ఫోరమ్ మాల్ దగ్గర బిజేపి కార్యకర్తలు నా కాన్వయ్ పై దాడి చేశారని ఆయన మీడియాకు వెల్లడించారు. బిజెపి వాళ్ళు ప్రస్టేషన్ తో నాపై దాడికి దిగారని ఆయన పేర్కొన్నారు.

కమలం పువ్వు నేతలకు చెబుతున్నా కారులో డబ్బులు పెట్టి పంచడానికి నేను వెర్రిపువ్వుని కాదు అని అన్నారు. బిజెపి నాపై దాడి చేసిన సమయంలో బిజేపి కార్యకర్తలు దాడికి దిగి కారుపై ఎక్కిన కారు నాది కాదు…..నా కాన్వాయ్ లో అన్నీ ఫార్చూనర్ లే అని ఆయన స్పష్టం చేసారు. బిజెపి కార్యకర్తలు నన్ను చంపటానికి ప్రయత్నించారన్నారు. బిజెపి నాపై చేసిన దాడిని ఈ చికెన్ నారాయణ సమర్దిస్తున్నారా అని మండిపడ్డారు. నేనూ కమ్యూనిస్టు బిడ్డనే ఇటువంటి దాడులకు బెదిరింపులకు భయపడేది లేదు అని స్పష్టం చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news